SKLM: బాహుదా నదిపై వంతెన నిర్మాణానికి చర్యలు చేపట్టాలని సీడాప్ మాజీ ఛైర్మన్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా ఇవాళ జడ్పీ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జేసీ ఫార్మన్ అహ్మద్ ఖాన్ను కలసి వినతి పత్రం సమర్పించారు. గత ప్రభుత్వం ఈ వంతెన కోసం రూ.20 కోట్లు మంజూరు చేసిన జీవో రద్దు అయిందన్నారు. ఎప్పటి వరకు వంతెన నిర్మాణం జరగలేదన్నారు.