NZB: విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఎడపల్లి మండలం ZPHS TM పాఠశాలకు ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ఏనుగు దయానంద్ రెడ్డి, ఏనుగు చంద్రశేఖర్ రెడ్డి దాతృత్వాన్ని ప్రదర్శించారు. వారు తమ సంస్థ వసంత టూల్స్ తరఫున సుమారు రూ. 80,000 విలువ గల నూతన మైక్సెట్ను, అలాగే 50 కుర్చీలను పాఠశాలకు విరాళంగా అందించారు.