WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో ఆదివారం పిచ్చికుక్క దాడిలో నలుగురు గ్రామస్థులు గాయపడ్డారు. గాంధీ సెంటర్ వద్ద వీధుల్లో తిరుగుతూ వచ్చిన కుక్క బిళ్ళ రాజు, పాల యాదగిరి, శేఖర్, రాజేందర్ తదితరులపై దాడి చేసింది. కుక్క దాడిలో గేదెలు కూడా గాయపడ్డాయని గ్రామస్తులు తెలిపారు. గాయపడిన వారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.