HYD: సౌదీలో జరిగిన ఘోర ప్రమాదంలో మృతి చెందిన 45 మంది అంత్యక్రియలు మదీనాలో అశ్రునయనాలతో అంత్య క్రియలు జరిగాయి. DNA రిపోర్టు వచ్చిన అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అక్కడి ప్రభుత్వం అప్పగించింది. దీంతో జన్నతుల్ బఖీ శ్మశానవాటికలో సామూహిక అంతిమ సంస్కరాలు నిర్వహించారు. యాత్రకు వెళ్లిన వారు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో కుటుంబసభ్యుల రోధన కలచివేసింది.