ATP: నాణ్యత పేరుతో అరటి రైతులకు అన్యాయం చేయవద్దని, కిలో అరటిని కనీసం రూ.6లకు తగ్గకుండా కొనుగోలు చేయాలని కలెక్టర్ ఆనంద్ వ్యాపారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో అరటి వ్యాపారులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. కనీస ధర ఇవ్వకుంటే, డ్వాక్రా మహిళలతో కొనుగోలు చేయించి విక్రయిస్తామని కలెక్టర్ గట్టిగా హెచ్చరించారు.