అనకాపల్లి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు సమస్యలపై అర్జీలను సమర్పించారు. కలెక్టర్ విజయ కృష్ణన్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని పరిశీలించి వారితో మాట్లాడారు. పీజీఆర్ఎస్లో అధికారుల దృష్టికి వచ్చిన సమస్యలను సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.