NZB: ఎడపల్లి మండల కేంద్రంలో రూ. 22 లక్షల వ్యయంతో 2022లో నిర్మించారు. ఈ రైతు వేదిక నిర్మాణం పనుల్లో కాంట్రాక్టర్ కక్కుర్తి పడి, నాణ్యతగా పనులు చేపట్టక పోవడంతో, ప్రస్తుతం ఈ భవనం ఒకవైపు నిరుపయోగంగా పడి ఉండగా, మరొకవైపు భవనం చుట్టూ వేసిన గోడలు కుంగిపోయాయి, మరికొన్నిచోట్ల గోడలు కూలిపోయాయి.