కృష్ణా: మాజీ ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డి తుఫాను ప్రభావిత ప్రాంతాలైన గూడూరు మండలం రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్.ఎన్. గొల్లపాలెం గ్రామాలలో పర్యటించడానికి షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసినట్లు డీఎస్పీ రాజా తెలిపారు. అయితే, హైవేపై ఎలాంటి గుమిగుడడం లేదా సమావేశాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.