CTR: చౌడేపల్లి మండలం కాగతిలో శారదమ్మ ఇంటిలో జరిగిన అగ్ని ప్రమాదానికి పెట్రోల్ విక్రయాలే కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు. వరండాలోని వెలిగించిన దీపం కారణంగా పెట్రోల్ క్యానులు,బాటిల్లకు మంటలు అంటుకొని ఇల్లంతా వ్యాపించినట్టు తెలిపారు. ఈ ప్రమాదంలో బైక్ తోపాటు ఇంటిలోని వస్తువులు కాలిపోవడంతో సుమారు రూ. 5 లక్షల నష్టం చేకూరినట్టు బాధితులు వెల్లడించారు.