NZB: నిబంధనలు పాటించని స్కూల్ బస్సులపై అధికారులు వరస దాడులు చేస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆదేశాల మేరకు బోధన్ పట్టణంలో పలు స్కూల్ బస్సులను ఆర్టీఏ అధికారులు, ఆర్డీవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం బోధన్ పట్టణంలో 12 స్కూల్ బస్సులను పరిశీలించారు. మూడు బస్సులకు రూ. 47వేల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.