రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ నుంచి మరోసారి సమన్లు అందాయి. బ్యాంకు మోసం, మనీలాండరింగ్ ఆరోపణలపై నవంబర్ 14న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. రూ.17,000 కోట్లకు పైగా నిధుల అక్రమ తరలింపుపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ విచారించనుంది. ఇటీవల రూ.7,500 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన అనంతరం ఈ సమన్లు జారీ అయ్యాయి.