ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును దక్కించుకున్నాడు. బ్యాటింగ్లో కీలక సమయంలో 21 పరుగులు చేయడంతో పాటు, బౌలింగ్లో 2 వికెట్లు తీసుకున్నాడు. దీంతో జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించినందుకు గాను అతడికి ఈ అవార్డు లభించింది.