CTR: సోమల(M), నంజంపేటలోని ఖిద్మత్-ఎ-ఖల్క్ మైనారిటీ యూత్ కమిటీ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గత ఐదు సంవత్సరాలుగా ప్రతి నెల 15 కుటుంబాలకు సహాయం అందిస్తూ వస్తున్న కమిటీ, రంజాన్ నెలలో ప్రతి సంవత్సరం 45 మంది నిరుపేద కుటుంబాలకు కులమతాలకు అతీతంగా నిత్యావసరాలు అందజేస్తోంది. ఈ కార్యక్రమంలో యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.