సత్యసాయి: జిల్లాలో మే 1న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 37 మండలాలు, మున్సిపాలిటీల్లోని 544 సచివాలయాల పరిధిలో మొత్తం 2,60,214 మంది లబ్ధిదారులకు పింఛన్లు అందజేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 114.90 కోట్లు విడుదల చేసింది.