ASR: మొంథా తుఫాన్ ప్రభావంతో గూడెం కొత్త వీధి మీదుగా భద్రాచలం, సీలేరు వెళ్లే బస్సులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఎస్సై సురేష్ తెలిపారు. కొండ చరియలు జారిపడే ప్రమాదం దృష్ట్యా ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పరిస్థితులు సాధారణం అయిన తర్వాత సర్వీసులు పునరుద్ధరించబడతాయని ఆయన చెప్పారు.