AKP: నక్కపల్లి మండలంలో 8 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో సీతారామరాజు తెలిపారు. సోమవారం బోయపాడులో తుఫాన్ షెల్టర్ను సందర్శించి, ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. బంగారమ్మ పేట, అమలాపురం, డీఎల్ పురం, దొండవాక, తీనార్ల, రాజయ్యపేట, డీ.ఎల్.పురం, బోయపాడు గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.