ELR: ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ శనివారం లక్కవరం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. హైవే పెట్రోలింగ్ కోసం ప్రభుత్వం రూ. 300 కోట్లు మంజూరు చేసిందని, త్వరలో కొత్త వాహనాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. గంజాయి రవాణా కట్టడిలో ఉందని, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు.