CTR: చిత్తూరు బజారు వీధిలోని శ్రీ శివ షణ్ముఖ వినాయక స్వామి వారి ఆలయంలో ఆదివారం ఉదయం ప్రారంభమైన 9వ మహా కుంభాభిషేక వార్షికోత్సవ పూజా కార్యక్రమాల్లో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పాల్గొన్నారు. ఆలయ కమిటీ కార్యవర్గ సభ్యులు, అర్చకులు, స్థానిక నాయకులు ఎమ్మెల్యేకి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు.