MBNR: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధమైన అలివేలు మంగమ్మ ఆలయంలో శనివారం హుండీ లెక్కింపు నిర్వహించారు. హుండీ ద్వారా మొత్తం రూ.10,09,442 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అలహరి మధుసూదన్ కుమార్, ఈవో శ్రీనివాస రాజు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.