AP: లిక్కర్ స్కామ్లో అరెస్టైన నిందితుల రిమాండ్ ఇవాళ్టితో ముగిసింది. దీంతో సిట్ ఈ రోజు వారిని విజయవాడ ACB కోర్టులో హాజరుపరచనుంది. ఇప్పటివరకు అరెస్టైన 12 మందిలో ఐదుగురు బెయిల్ పొందగా.. ఐదుగురు విజయవాడ జైలులో, ఇద్దరు గుంటూరు జైలులో జుడీషియల్ రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అటు బెయిల్ పొందిన ఐదుగురు కూడా కోర్టుకు హాజరుకానున్నట్లు సమాచారం.