ATP: గుంతకల్లు పట్టణంలోని పక్కిరప్ప కాలనీలో శనివారం పిచ్చికుక్క దాడిలో ఐదు మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పిచ్చికుక్క దాడిలో గాయపడిన నాగరాజు మాట్లాడుతూ.. కాలనీలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.