SRD: మండల కేంద్రమైన గుమ్మడిదల SC కాలనీలో మంచినీటి సమస్య నెలకొంది. దాంతో అంబేద్కర్ కాలనీకి చెందిన మహిళలు నేడు ఖాళీ బిందెలతో నిరసన ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత 15 రోజులనుంచి తాగేందుకు మంచినీళ్లు రావడంలేదని, ఈ విషయంలో ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్య వెంటనే తీర్చకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.