MNCL: బెల్లంపల్లిలోని ప్రధాన రహదారులతో పాటు ఇతర రోడ్లను కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని అధికారులను ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశించారు. శుక్రవారం మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ నివాసంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పట్టణంలో అమలు చేస్తున్న అభివృద్ధి పనుల గురించి మున్సిపల్ కమిషనర్ రమేష్, TPO, సంబంధిత ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు.