VSP: జననేత జగన్ విశాఖ పర్యటన సూపర్ సక్సెస్ అయిందని మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. పర్యటనలో ప్రజలు భారీగా తరలివచ్చి జననీరాజనాలు పలకడం కూటమి నేతల గుండెల్లో గుబులు పుట్టించిందని వ్యాఖ్యానించారు.