మార్కాపురం మండలంలోని గజ్జలకొండ పంచాయితీ పరిధిలోని మాలపాటి పల్లెలో శుక్రవారం కొండయ్య అనే రైతుకు చెందిన పొగాకు నిల్వలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ. 8 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించి తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని బాధిత రైతు కోరుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.