NGKL: గాజాపై జరుగుతున్న మరణకాండను ఆపాలని, ఇజ్రాయిల్కు సహకరిస్తున్న అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని AIYF జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆంజనేయులు, శ్రీనివాసులు డిమాండ్ చేశారు. పాలస్తీనా ప్రజలకు మద్దతుగా NGKL బస్ స్టాండ్ దగ్గర మంగళవారం AIYF ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రధాని మోడీ మౌనంవీడి పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలపాలని డిమాండ్ చేశారు.