బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూ కొనుగోలుదారులను భయపెడుతుంది. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,250 పెరిగి రూ.1,22,020కి చేరింది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.1,150 పెరిగి రికార్డు స్థాయిలో రూ.1,11,850 పలుకుతోంది. అటు కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.1,67,100కి చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే రేట్లు ఉన్నాయి.