ASR: పెదబయలు మండలంలోని సీకరి పంచాయతీ బొడ్డాపుట్టు గ్రామ సమీపంలో 502 కేజీల గంజాయి పట్టుబడిందని ఎస్సై కొల్లి రమణ ఇవాళ తెలిపారు. ముందస్తు సమాచారంతో తమ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేస్తుండగా జీపుపై తరలిస్తున్న గంజాయి పట్టుబడిందని చెప్పారు. ఈమేరకు గంజాయితో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని, గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశామన్నారు.