KDP: తొండూరు మండలంలోని మల్లేల గ్రామానికి చెందిన 28 ఏళ్ల దొడ్డి శ్రీనాథ్ అనే యువ రైతు, అప్పుల బాధను తట్టుకోలేక శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. జీవనోపాధి కోసం వ్యవసాయం చేయడానికి అప్పులు చేశాడు. అయితే, పంటలు చేతికి రాకపోవడం, ఆశించిన దిగుబడి లేకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. రుణాలు ఎలా తీర్చాలో తెలియక విషం త్రాగి మృతి చెందాడు.