SRD: సిర్గాపూర్ మండలం నల్లవాగు రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలను MEO నగరం మల్లేశం శుక్రవారం సందర్శించి తనిఖీ చేశారు. స్థానిక వసతులు సౌకర్యాలను పరిశీలించారు. పిల్లల నమోదు, ఉపాధ్యాయుల వివరాలు, మెనూ ప్రకారం భోజనం, విద్యార్థుల ఆరోగ్య పరీక్షలు తదితర రికార్డులను ఆయన పరిశీలించి నమోదు చేసుకున్నారు. ఇందులో ప్రిన్సిపాల్ తిరుపతయ్య, VP ఫణిందర్, విట్టల్ ఉన్నారు.