GNTR: పెదకాకాని మండలంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మండల పరిధిలోని నంబూరులో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా శ్రీ కనకదుర్గ అమ్మవారికి ఆదివారం మాజీ ఎమ్మెల్యే, జనసేన పార్టీ నేత కిలారి వెంకట రోశయ్య అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులతో పాటు జనసేన నేతలు పాల్గొన్నారు.