కరూర్ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున టీవీకే పార్టీ ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అలాగే క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అందించనుంది. ఈ మేరకు బాధితులకు అండగా ఉంటామని టీవీకే అధినేత విజయ్ ప్రకటించారు. కాగా నిన్న కరూర్లో విజయ్ నిర్వహించిన ర్యాలీలో 39 మంది మరణించిన విషయం తెలిసిందే.