శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణ పనులతోపాటు అభివృద్ధికి సహకారం అందించాలని ఎమ్మెల్యే గోండు శంకర్రావు కోరారు. ఆదివారం ఉదయం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్టేడియం అభివృద్ధితోపాటు, శ్రీకాకుళం, ఆముదాలవలస రహదారి అభివృద్ధికి కూడా కృషి చేయాలని సీఎంను కోరినట్లు వివరించారు.