ADB: ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ గ్రామంలో నెలకొన్న శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ అర్చకులు సోమశేఖర్, మహేష్ శనివారం తెలియజేశారు. 7రోజులపాటు కొనసాగుతున్న జాతరకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు వచ్చి మల్లన్నను దర్శించుకుంటారని అన్నారు. జాతరకు వచ్చే భక్తులకు త్రాగునీరు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.