KRNL: చాగలమర్రి మండలంలో ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతి ప్రవేశాల కోసం పేద విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 10వ తేదీ చివరి తేదీ అని మండల విద్యాధికారి న్యామతుల్లా ఇవాళ తెలిపారు. విద్యా హక్కు చట్టం-2009 ప్రకారం 25 శాతం సీట్లు పేదలకు కేటాయిస్తారని పేర్కొన్నారు. దరఖాస్తు చేసిన విద్యార్థులకు లాటరీ విధానంలో సీట్లు కేటాయిస్తారని ఆయన వెల్లడించారు.