సత్యసాయి: మడకశిర మండలం మలేరప్పం గ్రామం, పరిసర గ్రామాల్లో శుక్రవారం పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. గ్రామాల్లో శాంతిభద్రతలు కాపాడాలని, ఎలాంటి గొడవలు, అల్లర్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. బాల్యవివాహాలు, పోక్సో చట్టం, పోలీసు నిబంధనలపై అవగాహన కల్పించి ప్రజలను చట్టపరమైన అంశాలలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు.