SKLM: నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజను శుక్రవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ మేరకు నియోజక వర్గంలోని ఉపాధి హామీ పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి అని ఎమ్మెల్యే వినతి పత్రం అందజేశారు. సారవకోట ఎంపీడీవో కొత్త భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.