SKLM: ఆమదాలవలస మండలం కొత్తవలస గ్రామంలో వినాయక నిమజ్జన ఊరేగింపులో రెండు వేరు వేరు సామాజిక వర్గాలకు చెందిన వివాదం కొట్లాటకు దారి తీసింది. ఈ ఘర్షణలో అరసవల్లి హరమ్మ (70) గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై ఇరు వర్గాలకు చెందిన 14 మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై బాలరాజు మంగళవారం తెలిపారు.