KMM: ముదిగొండలోని రైతు వేదికలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యుల శిక్షణా తరగతులు బుధవారం ప్రారంభమయ్యాయి. మండలంలోని 126 మంది వార్డు సభ్యులకు ఐదు రోజుల పాటు ఈ శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీదేవి మాట్లాడుతూ.. గ్రామాల సమగ్ర అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. గ్రామాల్లో సమస్యలను సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని సూచించారు.