JGL: రోడ్డు ప్రమాద బాధితులకు, తక్షణ సహాయం చేసి ప్రాణాలు కాపాడిన వారికి “రహ్ వీర్ పథకం” ద్వారా రూ.25 వేల నగదు పారితోషికంతో పాటు ప్రశంసా పత్రం అందజేస్తామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత తొలి గంటను గోల్డెన్ అవర్గా పరిగణిస్తారని, ఈ సమయంలో గాయపడిన వారికి సమయానికి వైద్య సహాయం అందితే ప్రాణాలు రక్షించవచ్చన్నారు.