HYD: మియాపూర్లోని సాఫ్ట్వేర్ ఉద్యోగులే లక్ష్యంగా సాగుతున్న డ్రగ్స్ దందాను పోలీసులు ఛేదించారు. బెంగళూరులోని నైజీరియన్ల వద్ద MDMA కొనుగోలు చేసి విక్రయిస్తున్న ముగ్గురు సాఫ్ట్వేర్ యువకులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1.5 లక్షల విలువైన 12.6 గ్రాముల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు హనుమంతు, మహేష్, ఆదర్శ్పై కేసు నమోదు చేశారు.