KRNL: ఆదోనిలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివిధ పంటలకు సరైన సమయంలో యూరియా వేయకపోతే దిగుబడి తగ్గిపోతుందని, రైతుల కష్టాలను అర్థం చేసుకోవాలని డెమోక్రసీ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ కుమార్ గురువారం ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి రైతులకు యూరియా పంపిణీ చేయాలని అయన డిమాండ్ చేశారు.