KMM: ఖమ్మం జిల్లాలోని ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని విక్రమార్క విజ్ఞప్తి చేశారు. చింతకాని, మధిర, వైరా మండలాలకు రెడ్ అలెర్ట్, అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇవాళ తెలిపారు. చెరువులు, కుంటలు దగ్గర ఉండకూడదని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరు బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.