ఇటీవల ‘కుబేర’ మూవీతో మంచి హిట్ అందుకున్న హీరో ధనుష్ తదుపరి ప్రాజెక్టుపై ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఆయన.. దర్శకుడు వెంకీ అట్లూరితో మరోసారి సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని 2027లో స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా, గతంలో వీరిద్దరి కాంబోలో బ్లాక్ బస్టర్ సినిమా ‘సార్’ తెరకెక్కిన విషయం తెలిసిందే.