NLR: సంగం మండలంలోని దువ్వూరు బస్టాండ్ సెంటర్లో బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. రోడ్డు క్రాస్ చేస్తున్న మినీ వ్యాన్ను బుచ్చి నుండి సిద్దీపురం వెళ్తున్న బైకు ఢీకొట్టినట్లు స్థానికులు తెలియజేశారు. బైకుపై ఉన్న సాంబయ్య అనే వ్యక్తికి తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తోంది. చుట్టుప్రక్కల స్థానికులు108లో బుచ్చి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.