TPT: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఉద్యోగుల సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగుల కోసం వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. మార్చి 4న క్విజ్ పోటీలు, మార్చి 5న సంగీత పోటీలు నిర్వహించనున్నారు. డిప్యూటీ ఈవో ఆనందరాజు పర్యవేక్షిస్తున్నారు.