150 కోట్లతో అత్యంత భారీగా తెరకెక్కిన కుబేర చిత్రంలో తమిళ్ హీరో ధనుష్ మెయిన్ లీడ్ రోల్ చేస్తుండగా, యువసమ్రాట్ నాగార్జున మరో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే అయితే మొన్నీ మధ్యన హిట్ టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిత్ర నిర్మాతల్లో ఒకరైన సునీల్ నారంగ్ మాట్లాడుతూ ధనుష్ సినిమాలో హీరో కాదు. నాగార్జున కూడా హీరో కాదు. ఇద్దరూ కథలో పాత్రలు మాత్రమేనని తేల్చేశారు. ఎందుకంటే ధనుష్కి తెలుగులో ఎంత ఫాలోయింగ్ ఉందో ఎవ్వరికీ తెలియదు కానీ, నాగార్జున మాత్రం ఇక్కడ చాలా పెద్ద ఫాలోయింగ్ ఉన్న హీరో. ఆయన కోసమే థియేటర్కి వచ్చే ఫామిలీ ఆడియన్స్ గానీ, విమన్ ఆడియన్స్ గానీ, ప్రత్యేకంగా అక్కినేని అభిమానులు గానీ అసంఖ్యాకంగా ఉన్నారన్నది అందరూ ఒప్పుకునే విషయం.
కానీ పాన్ ఇండియా వ్యవహారంలో మాత్రం ధనుష్ అటు తమిళ్లో పెద్ద హీరో, పెద్ద బిజినెస్తో పాటు కన్నడ మళయాళ రాష్ట్రాలలో కూడా స్ట్రాంగ్ మార్కెట్ ఉన్న హీరోగా రికార్డుంది. ఇక్కడ తెలుగులో మాత్రం, లేదా ఓవర్సీస్లో ఉన్న తెలుగు ప్రేక్షకులు మాత్రం నాగార్జునని టార్గెట్ చేసే కుబేర సినిమాకి వెళ్తారన్నది అందరికీ తెలుసు. ఓకే….సినిమా బావుంటే గనక అన్నీ కలిసి వస్తాయి. శేఖర్ కమ్ముల ఫక్తు కమర్షియల్ కథని తనదైన స్టయిల్లో చెప్పడానికి గట్టి ప్రయత్నమే చేశాడు. ఆ ప్రయత్నమే ఎంతవరకూ సక్సీడ్ అయిందన్నది రేపు రిలీజు అయ్యాక వచ్చే టాక్ మీదనే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. కానీ, శేఖర్ కమ్ముల నిర్మాతల ప్రాణాలు తీసేశాడని పరిశ్రమలో చెప్పుకుంటున్నారు. తీసిందే తీసి, మళ్ళీ మళ్ళీ తీసి కోట్లు కోట్లు మంచినీళ్ళలా పారించాడని, సునీల్ నారంగ్ కాబట్టి తట్టుకుని సినిమాని పూర్తి చేసి విడుదల వరకూ తీసుకురాగలిగాడని, ఇంకొకడైతే మధ్యలోనే పారిపోయేవాడని కూడా టాక్. అందుకే సునీల్నారంగ్ కూడా హిట్ టీవితో మాట్లాడుతూ, ముందొక బడ్జెట్ చెప్తారు, తర్వాత అయ్యేది వేరేగా ఉంటుంది, ఏం చెయ్యగలం అని నిరాశగా చెప్పారు.
పైగా లోగడ నాగార్జునతో ఏషియన్ సంస్థ తీసిన సినిమా కూడా పెద్దగా ఏం పే చేయలేదు కాస్ట్ టు కాస్ట్ వర్కవుట్ అయిందని సునీలే కెమెరా ముందు ఒప్పుకున్నారు. అందువల్ల కుబేర సినిమా మాత్రం పూర్తిగా ఇప్పుడు ధనుష్ పాన్ ఇండియా మార్కెట్ మీదనే ఆధారపడి తీసిందని అర్ధమవుతోంది. కాకపోతే తెలుగువరకూ మాత్రం నాగార్జున బాగా ప్లస్ అవుతారనేది డౌటే లేదు. అదైనా సినిమా బావుంటేనే. అది కూడా సునీల్ వ్యక్తిగతంగా ఇంటర్వ్యూలో చెప్పినమాటే. శేఖర్ని ధనుష్ని దృష్టిలో పెట్టుకుని,డేట్స్ ఉన్నాయి కాబట్టి మంచి కథని తయారుచేయమని సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహనరావు అప్రోచ్ అయితే తగినంత సమయం తీసుకుని శేఖర్ చేసిన కథే కుబేర. ధనుష్ ఒక్కడూ అయితే మళ్ళీ కథ తేలిపోతుందని శేఖర్ ఆలోచించి, నాగార్జున ప్రస్తుతం పోషించిన పాత్రని కావాలని కల్పించుకున్నాడని డైరెక్షన్ డిపార్ట్మెంట్వారే చెప్పుకున్నారు. దీనికోసం వెంకటేష్ని కూడా అనుకున్నారు. కానీ ఇంతలో సంక్రాంతి సందర్భంగా విడుదలైన వెంకటేష్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఎప్పుడైతే అంత పెద్ద హిట్ అయిందో, వెంకటేష్ని అడగడానికి కూడా మొహమాటపడ్డారు నిర్మాతలు. మరో ఆప్షన్ అన్నదే లేక, నాగార్జున వైపు దృష్టి మళ్ళించారు. కాకపోతే వెంకటేష్కి ఎంతిస్తున్నారో, అంతే నాగార్జున కూడా అంతే తీసుకోవడమే ఇందులో కొసమెరుపు. కాకపోతే అంత బడ్జెట్ మీద కొట్టుకుపోయింది.
కాబట్టి, ఇందులో ధనుష్ ఒక్కడే హీరో అని చెప్పడానికి సునీల్కి మనసు ఒప్పుకోలేదు. నిజంగానే ట్రైలర్ చూస్తే నాగార్జున కూడా ఎక్కువ పోర్షన్లో కనిపిస్తున్నారు. సో….ధనుష్ ఒక్కడే హీరో అనడం సబబు కాదేమో. నాగార్జునకి ఉండాల్సిన వెయిటేజ్ నాగార్జునకి ఉంది. నాగార్జున అభిమానులు సేఫ్.