ASF: తిర్యాణి మండలంలోని పంగిడి మాదరా గిరిజన ఆశ్రమ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న ఆత్రం అనురాగ్ అనే విద్యార్థి విష జ్వరంతో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు రోజులు తిర్యాణి ఆసుపత్రిలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థి నిన్న మృతి చెందినట్లు తెలిపారు.