Mncl: లక్షెట్టిపేట పట్టణంలో కూరగాయలను విక్రయించే వ్యాపారులు ఆందోళన చేశారు. కూరగాయలను విక్రయించేందుకు సరైన స్థలం చూపించాలని కోరుతూ ఆదివారం పట్టణంలో ఆందోళన చేశారు. లక్షెట్టిపేటలో గురు, ఆదివారాలలో వారసంత జరుగుతోందని, రెండు చోట్ల సంత జరగడంతో నష్టపోతున్నామని వాపోయారు. వారంలో ఒకేరోజు వారసంత జరిగేలా చూడాలని, పాత బస్టాండ్ వద్ద సౌకర్యాలు కల్పించాలన్నారు.