NLR: రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు మంచి చేస్తుంటే వైసీపీ నేతలకు కడుపు మండిపోతుందని మంత్రి పొంగూరు నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన నెల్లూరులో మాట్లాడుతూ.. తల్లికి వందనం పథకంపై వైసీపీ నేతలు అర్థరహిత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తల్లికి వందనం డబ్బులు లోకేష్ అకౌంట్లోకి పోతున్నాయంటూ వైసీపీ దుష్ప్రచారం చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.